జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేద ప్రజలకు జీవనోపాధిని కల్పించడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి

ఏలూరు/జనవరి 8: ఉపాధి కూలీలకు రోజువారి వేతనం 300 రూపాయలు అందే విధంగా ఏలూరు జిల్లాలో పనులు చేపట్టే విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వె ట్రి సెల్వి అన్నారు. గురువారం స్థానిక క్రాంతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పథకం నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్. కె. వె ట్రి సెల్వి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న పనులు కోరిన వారందరికీ పని కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి రోజువారి వేతనం 300 రూపాయలు పొందే విధంగా ప్రణాళిక ప్రకారం పనులు కేటాయించుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించిన సమాచారానికి పూర్తిస్థాయిలో అందించడానికి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రముఖులు ఉపాధి హామీ పథకం పై స్పష్టమైన అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ శిక్షణ ద్వారా మీకున్న సమస్యలు, సందేహాలను, నివారించుకుని విధుల నిర్వహణలో పొరపాటు లేకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టి గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు, రైతులకు మీ ద్వారా మంచి జరిగేలాగా కృషి చేయాలని అన్నారు.
మన జిల్లా ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపులో తక్కువ సొమ్ము పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున పథకం యొక్క ముఖ్యమైన మార్గదర్శకాలను పనులు చేపట్టే విధానాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ లకు సూచించారు
శిక్షణా కార్యక్రమంలో ఈజీఎస్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ వైవి షణ్ముఖ కుమార్, ఎడిషనల్ కమిషనర్ పంచాయతీరాజ్ మల్లెల శివప్రసాద్, ఏలూరు ప్రాజెక్టుఎం డైరెక్టర్ డ్వామా కె.వెంకట సుబ్బారావు, జడ్పీ సీఈవో సుబ్బారావు, డిఆర్డిఏ పిడి డాక్టర్ విజయ రాజు, డిపిఓ కె . అనురాధ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఏ పురుషోత్తమరావు డి దామోదర్ రావు పి శ్రీదేవి, జిల్లాలోని ఎం జి ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.