జిల్లాలోని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈనెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వర్చువల్గా శంఖుస్థాపన, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ను వర్చువల్గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
ఏలూరు, నవంబర్, 10 : జిల్లాలోని రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈనెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వర్చువల్గా శంఖుస్థాపన, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ను వర్చువల్గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈనెల 11వ తేదీ ఉదయం 10. 30 ని.లకు కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు 60 పారిశ్రామిక ప్రాజెక్టులు మరియు 51 ఎంఎస్ఎంఈ లు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో సిహెచ్. పోతేపల్లిలో 208 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ను, నూజివీడు మండలం మోర్సిపూడి లో 110 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానున్న రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్, లను ముఖ్యమంత్రివర్యులు వర్చువల్గా శంఖుస్థాపన చేస్తారన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 20 ఎకరాలలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ను కూడా ముఖ్యమంత్రివర్యులు వర్చువల్గా ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు.