జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి కుటుంబసమేతంగా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Publish Date : 02/07/2024

ఏలూరు/ ద్వారకాతిరుమల, జులై, 2 : జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి కుటుంబసమేతంగా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. ఆలయంలో వేదపండితులు కలెక్టర్ దంపతులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచన మండపంలో వేద పండితులు కలెక్టర్ దంపతులకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, శాలువా, స్వామివారి చిత్రపటాన్ని కలెక్టర్ దంపతులకు అందజేశారు.
ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం. దుర్గారావు, ఆలయ సిబ్బంది నటరాజ్, హయగ్రీవాచార్యులు, సుబ్రహ్మణ్యం, ప్రభృతులు పాల్గొన్నారు.