Close

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) అర్జీలు211 స్వీకరణ… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 29/07/2024

ఏలూరు, జూలై, 29…. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న ప్రజల అర్జీలకు నాణ్యతమైన పరిష్కారం అందించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఇన్ ఛార్జి డిఆర్ఓ ముక్కంటి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ భాస్కరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు లతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమంలో 211 అర్జీలు స్వీకరించబడ్డాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రభుత్వ శాఖల పరంగా సమస్యలుంటే తక్షణమే వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీదారుల సమస్య పరిష్కారంలో అధికారులు నాణ్యతతోకూడిన పరిష్కారాన్ని చూపాలన్నారు. అర్జీలు స్వీకరించినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చిన సమయంలో వాటి పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈరోజు వచ్చిన అర్జీలలో కొన్ని….
జంగారెడ్డిగూడెం పేరంపేటకు చెందిన గోలి నర్సిరెడ్డి మే 24వ తేదీ నుండి మాధాన్యంను ప్రభుత్వం నకు కొనుగోలు చేశామని నేటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ విధమైన నగదు చెల్లించియుండలేదని కావున తమకు రావల్సిన మొత్తం సొమ్ములు అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు అర్జీ అందజేయగా కలెక్టర్ ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా సివిల్ సప్లైయి మేనేజరు కు ఆదేశించడం జరిగింది. ద్వారకాతిరుమలకు చెందిన పూర్తి దివ్యాంగుడైన కొండూరు సాయికృష్ణ 2014 వరకు దివ్యాంగుల పెన్షన్ అందిందని, తదనంతరం ఆధార్ లేని కారణంగా పెన్షన్ ఆపివేయడం జరిగిందని నాయొక్క చేతివ్రేలిముద్రలు, ఐరిష్ పడుటలేదని కనుక పెన్షన్ ఆపివేశారని, తనకు దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుతూ అర్జీని కలెక్టర్ కు అందజేయడం జరిగింది. కలెక్టర్ ఇతని సమస్యను పరిష్కరించి పెన్షన్ వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పిడిని ఆదేశించారు. అలాగే పంగిడిగూడెంకు చెందిన రంగారావు తమ భూమికి ఆన్ లైన్ లో పేరేవారి పేరు నమోదయినందున దానిని తొలగించి తన పేరును నమోదు చేయించాలని కోరుతూ అర్జీ అందజేశారు. టి. నర్సాపురంకు చెందిన గంధం సుజాత తన భూమిని వేరే వారి పేరుమీద రిజిస్ర్టేషన్ చేయించుకొని ఆన్ లైన్ చేయించుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరచి తమ పేరుమీద ఆన్ లైన్ చేయించాలని ధరఖాస్తు అందజేశారు.