ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) రద్దు : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Publish Date : 01/09/2024

ఏలూరు, సెప్టెంబర్, 1 : జిల్లాలో భారీ వర్షాలు కారణంగా ఈనెల 2వతేదీ సోమవారం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రెవిన్యూ, జిల్లా, మండల స్థాయి అధికారులు పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నందున జిల్లాలోని కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల స్థాయిలలో ఈనెల 2వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ తెలియజేసారు.