రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం మేరకు సాదించాలి – జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ
ఏలూరు, అక్టోబర్, 13 : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాలను సాదించేందుకు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం ఖరీఫ్ లో ధాన్యం సేకరణ లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతుల నుండి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, ఈ ఒక్క రైతుకీ ఎటువంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు తరచూ వచ్చే గోనెసంచులు, రవాణా, హమాలీ చార్జీలు, తేమశాతం, తదితర సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిపై ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని, ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్లు, రవాణా పరమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, డిఎస్ఓ విలియమ్స్, జిల్లా పౌర సరఫరాల సంస్ధ మేనేజరు శివరామమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె. హబీబ్ బాషా, డిసిఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.