• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 30/08/2025

ఏలూరు,ఆగస్టు 30: జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో చేసిన భధ్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం పరిశీలన రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటికప్పుడు గౌడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామని తెలిపారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర, ఇతర సిబ్బంది ఉన్నారు.