జూన్ 2వ తేదీన చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహణ

ఏలూరు/చింతలపూడి,జూన్ 1: జూన్ 2వ తేదీన సోమవారం చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ప్రజా
సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చింతలపూడి లోని
యం ఆరో వో కార్యాలయంలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని,
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. ప్రజలు
పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని
కోరారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కూడా యధావిధిగా సంబంధిత అధికారులతో గ్రీవెన్స్ స్వీకరణ నిర్వహించబడుతుందన్నారు.
అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 నేరుగా కాల్ చేయవచ్చని సూచించారు.