Close

పత్రికలలో ప్రచురించబడిన ప్రతికూల వార్తాంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పత్రికలలో ప్రచురించబడిన ప్రతికూల వార్తాంశాల పరిష్కార చర్యలపై మంగళవారం జిల్లా అధికారుల

Publish Date : 11/11/2025

ఏలూరు, నవంబర్, 11 : పత్రికలలో ప్రచురించబడిన ప్రతికూల వార్తాంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పత్రికలలో ప్రచురించబడిన ప్రతికూల వార్తాంశాల పరిష్కార చర్యలపై మంగళవారం జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వివిధ దినపత్రికలలో ప్రచురించిన ప్రతికూల వార్తాంశాలను జిల్లా అధికారుల పరిశీలన నిమిత్తం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతున్నదని, వాటిని అధికారులు ప్రతీరోజు పరిశీలించాలన్నారు. జిల్లాలో త్రాగునీటి కొరత, రోడ్లు, పారిశుద్ధ్యం, ప్రజా ఆరోగ్యం వంటి ప్రజా సేవలలో లోపాలపై అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతికూల వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ప్రతికూల వార్తాంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, తీసుకున్న చర్యలను, స్పందనను సదరు పత్రికల వారికి సమర్పించి ప్రచురణ జరిగేలా చూడాలన్నారు. దీర్ఘకాలంలో పరిష్కార చర్యలకు సంబంధించి ఉన్న అంశాలకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెంటనే పత్రికల వారికి పంపాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, డిపిఓ కె. అనురాధ, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, డిఈ ఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, డిఎంహెచ్ఓ డా. అమృతం, డిటిసి షేక్ కరీం , ప్రభృతులు పాల్గొన్నారు.