Close

మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన..

Publish Date : 03/06/2025

ఏలూరు, జూన్,3: ప్రస్తుతం రెడ్ క్రాస్ వద్దవున్న రెండు డయాలసిస్ మిషన్లకు అదనంగా మరో రెండు డయాలసిస్ మిషన్లతో డయాలసిస్ సెంటర్ ను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెడ్ క్రాస్ కార్యవర్గానికి సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ కె. వెట్రి సెల్వి వారిని మర్యాదపూర్వకంగా కలిసి రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాయ్ హాన్ కాఫీ లిమిటెడ్ వారు అందిస్తామన్న మరో రెండు మిషన్లతో రక్త యూనిట్ల నిల్వలను పెంచి రెడ్ క్రాస్ బ్లడ్ బ్లెడ్ కేంద్రంలో నాణ్యమైన, సురక్షితమైన రక్తాన్ని అవసరమైన ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని సేవా కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో ఉండేలా కమిటీ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఏలూరు శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య( చంటి) మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను జిల్లాలోని ప్రజలకు అందించే విషయంలో ఏలూరు నియోజకవర్గం తరఫున తన పూర్తి సహకారం ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, వృద్ధాశ్రమం, తెర్షియరి కేర్ సెంటర్, యోగ సెంటర్, చనిపోయిన వ్యక్తులకు ఉపయోగించే ఫ్రీజర్ బాక్సులు వంటి సేవ కార్యక్రమాలను దాతల సహకారంతో దశలవారీగా ఏర్పాటు చేయడం కోసం ఒక ఎకరం స్థలంను రెడ్ క్రాస్ సొసైటీకి కేటాయించాలని కోరగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జె.సత్యనారాయణ రాజు, ట్రెజరర్ ఎన్.బ్రహ్మానందం, ఆడిటర్ జి.శ్రీకాంత్, కార్యదర్శి బి. బెన్నీ, కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎం.చంద్రశేఖర్ మేతర అజయ్ బాబు, ఎం వివి నాగేశ్వరరావు, కే. శ్రీనివాస్, ఎం.మురళీకృష్ణ, పి.శ్రీరామరాజు బి.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.