పిఎం జన్ మన్ తో గిరిజనుల అభివృద్ధికి కృషి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

ఏలూరు,ఆగస్టు,21:జిల్లాలోని పివిటిజి అవాసాల్లోని అర్హులైన వారందరికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పధకాల ద్వారా లబ్దికలిగించేందుకు మిషన్ మోడ్ లో చర్యలు తీసకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
పిఎం జన్ మన్ పధకం అమలుపై బుధవారం రాష్ట్ర ఉన్నతాధికారులు , కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స అనంతరం పిఎం జన్ మన్ యోజన అనుసంధానమైన వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఈ పధకం అమలుపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర పధకాల ద్వారా పక్కాఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికి విద్యుత్, సోలార్,మొబైల్ టవర్లు, తదితర ఏర్పాట్లు కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పివిటిజి(పర్టిక్యులర్ల్లి వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) కింద బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు మండలాల్లో గిరిజనులకు ఆయా పధకాలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు విద్యా, ఆరోగ్యం, తదితర సర్వీసులను సంతృప్తిస్ధాయిలో అందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు, విద్యా, ఆరోగ్యం, గృహాల కల్పన, శతశాతం కల్పించేందుకు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కుటుంబం యూనిట్ గా ప్రణాళిక అమలు చేయాలన్నారు. జిల్లాలో 86 పివిటిజి నివాసిత ప్రాంతాల్లో 9347 మంది పివిటిజి జనాభా కలిగియున్నారని, వారిలో ఇంతవరకు 5320 మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ పూర్తయిందన్నారు. మిగిలినవారు కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అర్హులైన వారందరికి ఆయూష్మాన్ భారత్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ సత్యనారాయణ, డిఎంహెచ్ఓ ఎస్. శర్మిష్ట, ట్రైబుల్ వెల్పేర్ డిడి పివిఎస్ నాయుడు, గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఇఇ కెవిఎస్ఎన్ కుమార్, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి,ఎన్టిఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.రాజీవ్ ,తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.