Close

బదిలీపై వెళ్లుతున్న జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 29/10/2024

ఏలూరు, అక్టోబర్ 29 : స్పష్టమైన ఆలోచన, విషయంపట్ల అవగాహనతో సహ ఉద్యోగులతో సమర్ధవంతంగా డిఆర్ఓ డి. పుష్పమణి విధులు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లుతున్న డి. పుష్పమణికి వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది ఆత్మీయ విడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను జిల్లా కలెక్టర్ గా వచ్చన ఈ నాలుగు నెలలు కాలంలో డిఆర్ఓ డి. పుష్పమణి స్పష్టమైన ఆలోచన, విషయంపట్ల అవగాహనతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో కూడా నిబద్ధత, జవాబుదారితనంతో పనిచేసినట్లు తమ తెలిసిందని అన్నారు. భారీ వర్షాలు, వరదలు సమయంలో డిఆర్ఓగా మంచి సర్వీసు అందించారని కలెక్టర్ కొనియాడారు.
విడ్కోలు సభలో డిఆర్ఓ డి. పుష్పమణి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఎన్నికల సమయంలో తనకు ఎంతో ప్రోత్సాహం అందించారని, వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పుష్పమణి కి పుష్పగుచ్చాలు,శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు.
సభలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టర్లు, ముక్కంటి, దేవకిదేవి, ఎస్డి సి కె.భాస్కర్, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్స్ పర్యవేక్షకులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.