Close

ప్రజల నుంచి 3,734 అర్జీలు స్వీకరణ.. జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి.

Publish Date : 24/12/2024

ఏలూరు,డిసెంబర్,24: ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 349 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితెలిపారు.జిల్లాలో మంగళవారం నిర్వహించిన 27 రెవిన్యూ సదస్సుల్లో 212 మంది పాల్గొని ఆయా సమస్యలపై అర్జీలను అందజేయగా వాటిలో అప్పటికప్పుడే 86 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 349 గ్రామ రెవిన్యూ సదస్సులకు 15,123 మంది హాజరై 3,734 అర్జీలు అందజేయగా ఇప్పటికే 938 అర్జీలు పరిష్కరింపబడ్డాయన్నారు. రెవిన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.