Close

ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం(పి-4) తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి..

Publish Date : 17/03/2025

ఏలూరు,మార్చి,17: జీరో పావర్టీ పి-4 గోడపత్రికను సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పి-4 విధానం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పీ4 విధానంలో ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటి అభివృద్ధి, ప్రతి గ్రామానికి ప్రగతి కల్పనకు సమాజంలో ఉన్న 20 శాతం అత్యంత నిరుపేదల అభ్యున్నతికి టాప్ 10 శాతం తెలుగు ప్రవాసులను, అధిక సంపన్న వ్యక్తుల సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు చెప్పారు. ఇందుకోసం ఈనెల 25వ తేదీలోపు https://swarnandhra.ap.gov.in/p4 వెబ్ సైట్లో ప్రజలు తమ విలువైన అభిప్రాయాలు తెలుపవచ్చన్నారు.
కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సిపివో వాసుదేవరావు, ఆర్డివో అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఎస్ఓ జె. రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.