Close

రాష్ట్రంలో 14,145 రేషన్ డిపోలు ద్వారా 7 లక్షలు రేషన్ కార్డు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీకి చర్యలు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్

Publish Date : 27/10/2025

ఏలూరు, అక్టోబరు 27: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాను ప్రభావిత 12 జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో పౌర సరఫరాలు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి మొత్తం 12 జిల్లాలో యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. ఈ జిల్లాల్లో 14,145 రేషన్ డిపోలు ద్వారా 7 లక్షలు కార్డు దారులు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సబ్సిడీ రూపంలో రేపు ఉదయం 9:00 గంటలు నుండి అందిస్తున్నామని అన్నారు. మొంథా తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు జిల్లాలో టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని రైతులు వాడుకోవచ్చునని తెలిపారు. ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 626 వివిధ కంపెనీల బంకులలో 35,443 లీటర్లు డీజిల్ ఆయిల్, పెట్రోల్ అదనంగా నిల్వలను అందుబాటులో ఉంచి, కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న 1,500 మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు నుంచి తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే కోత కోసిన వరి ధాన్యం వ్యవసాయ అధికారుల సహకారంతో పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత ఏడాది మాదిరిగానే టార్పాలిన్లు, తాళ్లు, ఇసుక సంచులు, ప్లాస్టిక్ట్ షీట్లు అందుబాటులో ఉంచామని అవసరాన్ని బట్టి వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమాచార వ్యవస్థలో ఏటువంటి అంతరాయం లేకుండా చూడాలని, సెల్ టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్లుకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా డీజిల్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, సమాచార వ్యవస్థ బాగుండేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.