Close

పోలవరం ఆర్ అండ్ ఆర్, జాతీయ రహదారుల భూసేకరణలపై అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్

Publish Date : 12/11/2025

ఏలూరు, నవంబర్, 11: జిల్లాలో పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, కాలనీల నిర్మాణం, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ను సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పనుల నిమిత్తం పీసా కమిటీ గ్రామ సభలలో లో 1859. 74 ఎకరాలు ఆమోదం నిమిత్తం ఉంచగా, 1734. 63 ఎకరాలు ఆమోదం జరిగిందని, మిగిలిన 125. 11 ఎకరాలు ఆమోదం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా సేకరణ చేయాలవసిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ఎన్ .హెచ్. 165, గ్రీన్ ఫీల్డ్ హై వే , జీలుగుమిల్లి- పట్టిసీమ, ,పెడన-లక్ష్మీపురం 216-హెచ్ రహదారి, పట్టిసీమ-గూటాల రహదారుల భూసేకరణ పై, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణ జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్ట్ లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు యం.అచ్యుత అంబరీష్, రమణ, స్పెషల్ కలెక్టరు యస్.సరళ వందనం, కలెక్టరేట్ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, జిల్లా భూసేకరణ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ,తదితరులు పాల్గొన్నారు.